Brahmamudi: కావ్యకి పొంచి ఉన్న ప్రమాదం.. రుద్రాణి ప్లాన్ నెరవేరేనా!
on Jan 3, 2026
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -920 లో..... ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలని చీటీలు రాసి అందులో ఎవరికి ఏది వస్తుందో.. అది పర్ఫామ్ చెయ్యాలని రాజ్ చెప్తాడు. మొదటగా సీతారామయ్య ఒక పద్యం చెప్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. తర్వాత స్వప్న, రాహుల్ చీటీలో వచ్చిన సినిమా పేరు యాక్టింగ్ చేసి చూపిస్తే.. అది చెప్పాలి.. అలా రాహుల్ యాక్టింగ్ చేస్తుంటే స్వప్న చేస్తుంది.
ఆ తర్వాత రుద్రాణి డైలాగ్ చెప్తుంది. అప్పు , కళ్యాణ్ వంతు వస్తుంది. అలా అందరు ఏదో ఒక పర్ ఫామెన్స్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు నువ్వు ఆయుర్వేద మందు తాగలేదని కావ్యకి రాజ్ గుర్తుచేస్తాడు. తను మర్చిపోతే నువ్వు గుర్తు చేయాలి కదా వెళ్లి తీసుకొనిరా అని ఇందిరాదేవి అనగానే రాజ్ వెళ్లి తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు కావ్య అది తాగుతుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు ఒక పర్ ఫామెన్స్ చేస్తారు. సుభాష్ డైలాగ్ చెప్తాడు. ఇక మిగిలింది రేఖ. తనని అందరు డ్యాన్స్ చేయమంటారు. తనేమో బావతో చేస్తానని అంటుంది.
కావ్య వంక చూస్తాడు రాజ్. రేఖ ఆల్రెడీ రాజ్ తో డ్యాన్స్ చెయ్యాలని ఫిక్స్ అవుతుంది. రాజ్ ఇబ్బంది పడుతూ డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరు డ్యాన్స్ చేస్తుంటే రుద్రాణి మురిసిపోతుంది. తరువాయి భాగంలో కనకం తన ఇద్దరు కూతుళ్ళకి శ్రీమంతం చెయ్యడానికి తమ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వస్తుంది. శ్రీమంతం ఇక్కడే అని అపర్ణ, ఇందిరాదేవి అనగానే కనకం సరే అంటుంది. ఆ తర్వాత పసరు మందు ఇది బాగా పని చేస్తుందని మళ్ళీ ఒకతను వచ్చి రుద్రాణికి ఇస్తాడు. పసరు మందు కలిపిన భోజనం కావ్య తింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



