ENGLISH | TELUGU  
Home  » TV News

'నేనేదైనా త‌ప్పుచేసుంటే సారీ ఇమ్మూ'.. ఎమోష‌న‌ల్ అయిన వ‌ర్ష‌!

on Sep 24, 2022

జబర్దస్త్ స్టేజి ఎంతో మందిని కలిపింది. ఆ షో ద్వారా పాపుల‌ర్ అయిన రీల్ లైఫ్ జోడీస్ చాలా మంది ఉన్నారు. ఇలాంటి జోడీస్ లో సుధీర్-రష్మీ ఒక సంచ‌ల‌నం అయితే, ఇమ్ము-వర్ష జోడి ఇంకో సంచ‌ల‌నం. కెవ్వు కార్తీక్ టీమ్ లో చేసేటప్పుడు ఇమ్మూతో లవ్ ట్రాక్ నడిపింది వ‌ర్ష‌. ప్రస్తుతం బులెట్ భాస్కర్ టీమ్ లో వర్ష స్కిట్స్ చేస్తోంది. 

ఐతే ఈ మధ్య కొన్ని నెలలుగా ఇమ్ము, వర్ష జోడీగా పెర్ఫార్మ్ చేయడం లేదు. వీళ్ళ కెమిస్ట్రీ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏమైంద‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఇమ్ము మీద ఒకసారి వర్ష ఫుల్ ఫైర్ అయ్యింది. ఐతే ఆ టైంలో ఆది, రాంప్రసాద్ వర్ష ని కూల్ చేశారు కానీ ఆ ఎపిసోడ్ ఏమిటో అలా పూర్తయ్యింది. 

ఐతే ఇటీవల లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలో వర్ష చాలా బాధపడుతూ కనిపించింది. ఈ న్యూ ఎపిసోడ్ లో "అమ్మ నా కోడలా" పేరుతో స్పెషల్‌ ఎపిసోడ్‌ చేశారు. ఇందులో తమ మనసులో ఉన్న బాధని బయటపెట్టమని చెబుతుంది రష్మి. ఒక్కొక్కరు వచ్చి తమ బాధలను చెప్పారు. వ‌ర్ష‌, "ఓ మూడు నాలుగు నెలల నుంచి మేం సరిగా మాట్లాడుకోవట్లేదు. నేను ఏదన్నా తప్పు చేసుకుంటే ఐ యామ్ సారీ" అని చెప్పింది.

ఆమె మాట‌ల‌కు ఇమ్ము చాలా ఎలా స్పందించాలో తెలీన‌ట్లు సైలెంట్‌ గా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.