చిరంజీవి రజాకార్ల సినిమా చేస్తారా?
on May 15, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సినిమా చేయాలన్నది తన జీవిత కోరిక అని దర్శకుడు సంపత్ నంది తెలిపారు. 'ఏమైంది ఈవేళ' అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, రెండో చిత్రానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారు. అదే 'రచ్చ' సినిమా. ఆ విధంగా అతడికి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. అతడి కోరికను మెగాస్టార్ మన్నిస్తారో లేదో చూడాలి.
మాస్ మసాలా కమర్షియల్ ఫిల్మ్ 'రచ్చ'తో కమర్షియల్ దర్శకుల జాబితాలో సంపత్ నంది చేరిపోయారు. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద సినిమాలు తీశారు. ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా 'సిటీ మార్' సినిమా తీస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఆ సినిమా షూటింగ్ బ్రేక్ పడింది. ఈ సమయంలో ఆయన తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు. అది పూర్తయిన తర్వాత చిరంజీవి గారికి వినిపించాలని అనుకుంటున్నారు. చిరంజీవితో రజాకార్ల నేపథ్యంలో సినిమా తీయాలనేది సంపత్ నంది కోరిక. ఇటీవల ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో 'సైరా' చేసిన చిరంజీవి రజాకార్ల నేపథ్యంలో కూడా సినిమా చేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
