తెలుగులో ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ.. ఓటీటీలోనే!
on Dec 4, 2021
సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి. గుహన్.. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన '118' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమా హిట్ కావడంతో దర్శకుడిగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు).
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలకానుంది. 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' డిజిటల్ రైట్స్ని 'సోనిలివ్' సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్లో ప్రసారం కానుంది. శివాని రాజశేఖర్ ఇటీవల తేజ సజ్జతో కలిసి 'అద్భుతం' సినిమాతో ఓటీటీలో ఆకట్టుకుంది. ఇప్పుడు 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'తో మరోసారి అలరిస్తుందేమో చూడాలి.
చిత్ర నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మాట్లాడుతూ.. "మా ఫస్ట్ మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోనివంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. ఈ సినిమా సోనిలివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్గారి మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుంది." అన్నారు.
Also Read