బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్న 'వైల్డ్ డాగ్'
on Aug 7, 2020
అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలు తమ సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. నాగార్జున 'వైల్డ్ డాగ్', నాగచైతన్య 'లవ్ స్టోరి', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సినిమాలు చేస్తున్నారు. వీటిలో నాగచైతన్య, అఖిల్ సినిమాలు ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఉండాలి. కానీ మార్చి నుంచి షూటింగ్లు నిలచిపోవడంతో దానికి అనుగుణంగా వాటి విడుదల నిలిచిపోయింది. వాటికి సంబంధించి కొన్ని సన్నివేశాలు మాత్రమే తీయాల్సి ఉంది. థియేటర్లు తెరిచేలోగా వాటిని పూర్తిచేసి సినిమాలను విడుదల చేయాలని వాటి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీకి సంబంధించిన మూడు వారాల షెడ్యూల్ మిగిలింది. అందిన సమాచారం ప్రకారం ఈ షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరగనుంది. వాస్తవానికి ఆ షెడ్యూల్ బ్యాంకాక్లో నిర్వహించాలి. కానీ ఇప్పుడు అక్కడకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడే సెట్ వేసి తీస్తారని చెబుతున్నారు. నాగార్జునకు 'సోగ్గాడే చిన్నినాయనా' తర్వాత సరైన హిట్ పడలేదు. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న 'వైల్డ్ డాగ్' ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి.