ఇండస్ట్రీలో ఎవరూ ఛాన్సులియ్యరు.. మనమే తీసుకోవాలి!
on Feb 5, 2020
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ మనకు ఛాన్సులియ్యరనీ, మనమే ఆ అవకాశాల్ని తీసుకోవాలనీ కామెంట్ చేయడం ద్వారా యంగ్ హీరో విష్వక్ సేన్ మరోసారి తన ముక్కుసూటితనాన్ని ప్రదర్శించాడు. తను హీరోగా పరిచయమైన 'ఫలక్నుమా దాస్' సినిమా సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు నందు హీరోగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన 'సవారి' ప్రి రిలీజ్ ఈవెంట్కు గెస్టుగా హాజరైన విష్వక్ సేన్ తనదైన శైలిలో మాట్లాడాడు.
"నందు, నేను దిల్సుఖ్ నగర్ బ్యాచ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తను జిమ్ కు వెళ్తూ సిక్స్ ప్యాక్ చేసేవాడు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఛాన్సులియ్యరు. మనమే తీసుకోవాలి. అల్రెడీ నందు తీసుకున్నాడు. నేనూ అట్లానే తీసుకున్నా. సాహిత్ కూడా ఎవరి దగ్గరా చెయ్యిచాపకుండా తన బ్రదర్, ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమా చేశాడు. ఇలాంటి వాళ్లు తమ డబ్బుపెట్టి, తమ టాలెంట్ చూపించాలని గుడ్ ఇన్టెన్షన్ తో సినిమాలు తీస్తారు. మంచి ఇన్టెన్షన్ తో సినిమా తీసేవాడికెప్పుడూ తప్పు జరగదు. నేనూ అలాంటి ఇన్టెన్షన్ తోటే సినిమాల్లోకి వచ్చినా. చాలామంది విష్వక్ డబ్బులెక్కువయ్యి సినిమా తీశాడనుకుంటారు. అది తప్పు. చాలామంది దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకుని, అందరికీ వాళ్ల డబ్బులు ఇచ్చేస్తే చాలనే ఇన్టెన్షన్ తో, ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిద్దామనే ఉద్దేశంతో సినిమా తీసినా. సాహిత్ కు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పట్నుండీ నందు ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. చాలామంది హీరోలతో పాటు చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఆ డైరెక్టర్లకు మనం అందుబాటులో ఉంటే చాలు" అని చెప్పాడు విష్వక్. 'సవారి' సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మరోవైపు విష్వక్ సేన్ 'హిట్' అనే మూవీ చేస్తున్నాడు. వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై హీరో నాని ప్రెజెంట్ చేస్తోన్న ఈ మూవీతో శైలేష్ కొలను డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. ఫిబ్రవరి 28న 'హిట్'ను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.