మాస్లో పవరేంటో 'వాల్మీకి'తో అర్థమైంది!
on Sep 16, 2019
మాస్ సినిమా చేస్తే ఎలాంటి కిక్ వస్తుందో, మాస్లో ఎలాంటి పవర్ ఉంటుందో వరుణ్ తేజ్కు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేసిన 'వాల్మీకి'.. అతనికి తొమ్మిదో సినిమా. ఇదివరకు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 'లోఫర్' అనే మాస్ సినిమా చేసినా హిట్ అందుకోలేకపోయిన అతను, ఇప్పుడు 'వాల్మీకి'ని తన ఫస్ట్ మాస్ ఫిలింగా భావిస్తున్నాడు.
ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన వరుణ్ "వాల్మీకి నా తొమ్మిదో సినిమా. ఫస్ట్ మాస్ సినిమా. ఫస్ట్ టైమ్ ఒక మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరు. చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తుండేవారు.. 'మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో.. నీకు అర్థం కావడం లేదు, మాస్లో ఒక పవర్ ఉంటుంది' అని. ఇప్పుడు అర్థం అయింది. ఈ సినిమా అవడానికి ముఖ్య కారణం హరీష్ శంకర్ గారు. కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ అందరిలాగా నేనూ చాలా సంవత్సరాలు 'సరైన హిట్ ఎవరిస్తారు?' అనుకున్నాను. 'గబ్బర్సింగ్' చూశాక ఇది సినిమా అనిపించింది. మా బాబాయ్కి అంత పెద్ద హిట్ ఇచ్చిన ఆయన నాతో చేయడం నిజంగా నా అదృష్టం. సెట్లో కూడా సూపర్ ఎనర్జీతో ఉంటారు. ఆయన సపోర్ట్, గైడెన్స్ వల్లే ఈ క్యారెక్టర్ ఇంత మంచిగా చేయగలిగాను. మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట నాతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు. ఫుల్ సపోర్ట్ చేసారు. వారితో నా ప్రయాణం కొనసాగుతుంది. అలాగే అయనంక బోస్ విజువల్స్ చాలా బాగున్నాయి. 'ముకుంద' సినిమా తర్వాత పూజతో అమేజింగ్ సీక్వెన్స్ చేశాను. స్పెషల్గా 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ రీమిక్స్ చేశాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో మిక్కీ ఫస్ట్ టైమ్ మాస్ సాంగ్స్ అదరగొట్టాడు. డెఫినెట్గా సెప్టెంబర్ 20న 'వాల్మీకి' మీ అందరికీ నచ్చుతుంది" అన్నాడు.