ENGLISH | TELUGU  

నవంబర్ 29న వస్తున్న ధనుష్ 'తూటా'

on Nov 23, 2019

 

గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ధనుష్ తొలిసారిగా నటించిన తమిళ చిత్రం 'ఎనై నోకి పాయుమ్ తోట'. తెలుగులో ఈ మూవీని 'తూటా' పేరుతో అనువదిస్తున్నారు. ధనుష్ సరసన నాయికగా మేఘా ఆకాష్ నటించింది. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తయారవుతున్న ఈ చిత్రాన్ని రెండు భాషల్లో నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. 'అసురన్' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ధనుష్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. విజయభేరి వారి బ్యానర్ పై జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. 

'తూటా' మూవీపై టాలీవుడ్, కోలీవుడ్‌లో పాజిటివ్ బజ్ వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ స్టన్నింగ్ విజువల్స్‌తో ఆకట్టుకుంటాయంటున్నారు. సంగీతం ప్రధాన ఆకర్షణ అవుతుందని నిర్మాతలు చెబుతున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ మూడేళ్లకు పైగా విరామం తీసుకొని చేసిన సినిమా కావడంతో, ప్రతిష్ఠాత్మకంగా ఆయన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని వాలు తెలిపారు. శశికుమార్, సునయిన, వేల రామమూర్తి, సెంథిల్ వీరసామి నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్ సంగీతం: ధర్భుక శివ, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కదిర్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.