`శ్యామ్ సింగ రాయ్`కి హైలైట్ గా సాయిపల్లవి గీతం!
on Oct 25, 2021
డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి పాటలంటేనే యూట్యూబ్ రికార్డులకి కేరాఫ్ అడ్రస్. `ఫిదా`లో ``వచ్చిండే``, `ఎంసీఏ`లో ``ఏవండోయ్ నానిగారూ``, `మారి 2`లో ``రౌడీ బేబి``, `లవ్ స్టోరి`లో ``సారంగ దరియా``.. ఇలా సాయి పల్లవి నర్తించిన పలు గీతాలు యూట్యూబ్ ముంగిట కోట్ల మంది వీక్షకుల ఆదరణకు నోచుకున్నాయి. కట్ చేస్తే.. త్వరలో రానున్న `శ్యామ్ సింగ రాయ్`లోనూ సాయి పల్లవి ఓ కనువిందైన పాటలో సందడి చేయబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేసిన పిరియడ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. ఇందులో ముగ్గురు నాయికల్లో ఒకరిగా సాయి పల్లవి కనిపించనుంది. అంతేకాదు.. బెంగాలీ యువతిగా ఆమె దర్శనమివ్వనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో దసరా నవరాత్రుల సందర్భంగా సాగే ఓ క్లాసికల్ డాన్స్ నంబర్ ఉంటుందట. భారీ వ్యయంతో సాయి పల్లవిపై చిత్రీకరించిన ఈ పాట.. సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. మరి.. సాయి పల్లవి నృత్యం ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 24 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన `శ్యామ్ సింగ రాయ్`కి మిక్కీ జే మేయర్ బాణీలు అందించాడు. ఇందులో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టెయిన్ నాయికలుగా నటించారు.
Also Read