మహేశ్కి సిస్టర్ గా సాయిపల్లవి?
on Jan 17, 2022
`లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రాలతో గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి. త్వరలో ఆమె కథానాయికగా నటించిన `విరాట పర్వం` విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో చెల్లెలి పాత్రలో నటించేందుకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` చిత్రాల తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా సందడి చేయనుంది. కాగా, ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని, ఈ నేపథ్యంలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవితో సంప్రదింపులు జరిపారని బజ్. కథ, పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.