'పుష్ప' మాస్ సాంగ్.. 'సామి సామి' ప్రోమో వచ్చేసింది!
on Oct 25, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు విశేష స్పందన రాగా.. తాజాగా మూడో పాట విడుదల తేదీని ప్రకటిస్తూ సాంగ్ ప్రోమోని విడుదల చేసింది మూవీ టీమ్.
అల్లు అర్జున్- దేవిశ్రీప్రసాద్- సుకుమార్ కాంబినేషన్ అంటే సంగీత ప్రియులలో ఆసక్తి ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య-2 చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప సాంగ్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ కు విశేష స్పందన వస్తోంది. ఈ ఉత్సాహంలో మూడో సాంగ్ ను విడుదల చేయడానికి సిద్ధమైంది పుష్ప మూవీ టీమ్.
'సామి సామి' సాంగ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. "నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ" అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 28న ఫుల్ సాంగ్ను విడుదల చేయబోతున్నట్లు ప్రోమోలో తెలిపారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను మౌనిక యాదవ్ ఆలపించారు. మరి పుష్ప మూడో సాంగ్ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Also Read