ENGLISH | TELUGU  

సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 

on Jan 6, 2026

 

టాలీవుడ్ లో రూపొందిన ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ లో 'బొమ్మరిల్లు' ఒకటి. సిద్దార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ 2006 ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ ఆగస్టుతో 'బొమ్మరిల్లు' సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ తరుణంలో బొమ్మరిల్లు సీక్వెల్ గురించి నిర్మాత దిల్ రాజు(Dil Raju) మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

 

ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలై విజయం సాధించింది. తాజాగా నిర్వహించిన ఈ మూవీ థాంక్యూ మీట్ కి దిల్ రాజు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 తీయొచ్చని అన్నారు. (Shambhala Thank You Meet)

 

Also Read: హీరో విజయ్ కి సీబీఐ నోటీసులు!

 

"20 ఏళ్ళ క్రితం మేము తీసిన బొమ్మరిల్లు సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. బొమ్మరిల్లు ఫాదర్ పాత్ర ఎన్నో ఫ్యామిలీస్ లో చేంజెస్ తీసుకొచ్చింది. ఒకవేళ బొమ్మరిల్లు-2 తీయాల్సి వస్తే.. సాయికుమార్ గారు, ఆది స్టోరీ పెట్టి తీయాలి. కొడుకు సక్సెస్ గురించి తండ్రి పడే తపన మామూలుది కాదు. ఆదికి ఒక్కడికే కాదు.. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ బ్యాక్ బోన్ లా సాయికుమార్ గారు నిలిచారు." అని దిల్ రాజు అన్నారు.

 

మరి సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 తీయొచ్చని చెప్పిన దిల్ రాజు.. దానిని నిజం చేసే దిశగా అడుగులు ఏమైనా వేస్తారేమో చూడాలి.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.