రవితేజ తల్లిపై కేసు!
on Jan 21, 2022
స్టార్ యాక్టర్, 'క్రాక్' సినిమాతో బ్లాక్బస్టర్ సాధించి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ వస్తున్న రవితేజ తల్లి రాజ్యలక్ష్మిపై కేసు నమోదవడం టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం దగ్గర పుష్కర కాలువను కొంతమంది ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి, మర్రిపాక గ్రామ వాస్తవ్యుడు సంజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read: 17 ఏళ్ళ తరువాత వేసవి బరిలో చిరు!
సర్వే నంబర్ 108, 124లో ఉన్న పుష్కర కాలువతో పాటు, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారనేది వారిపై ఉన్న అభియోగం. ఈ ఘటనలో రవితేజ తల్లికి ఉన్న సంబంధమేమిటనేది తెలియాల్సి ఉంది. కాగా గతంలో టాలీవుడ్ డ్రగ్ కేసులో రవితేజ పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు.
Also read: చైతూతో విడాకుల పోస్ట్ను తొలగించిన సామ్.. ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?
పని విషయానికి వస్తే రవితేజ నటించిన 'ఖిలాడి' విడుదలకు రెడీ అవుతుండగా, 'రామారావు ఆన్ డ్యూటీ', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.