'సిరివెన్నెల' కలం నుంచి జాలువారిన 'పక్కా కమర్షియల్' సాంగ్!
on Feb 2, 2022

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదలైంది. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ఇది. అంతేకాదు ఈ పాటను సిరివెన్నెల చివరి పాటగా మూవీ టీమ్ పేర్కొంది.
"పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్..
దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్..
ఎయిర్ ఫ్రీయా.. నో..
నీరు ఫ్రీయా.. నో..
ఫైర్ ఫ్రీయా.. నో..
నువ్ నుంచున్న జాగా ఫ్రీయా..
అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్..
జన్మించినా మరణించినా అవదా ఖర్చు..
జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు.."
అంటూ సిరివెన్నెల రాసిన లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెలని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్లో ఉందని మారుతి చెప్పారు.
బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. జకేస్ బీజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



