మహేష్ ధియేటర్లో అఖిల్ చిత్రం!!
on Dec 10, 2018
యంగ్ హీరో అక్కినేని అఖిల్ `హలో` తర్వాత మూడో చిత్రంగా వస్తోంది `మిస్టర్ మజ్ను`. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. మహేష్ లేటెస్ట్ గా ప్రారంభించిన ఏయంబి సినిమాస్ లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశం ఒకటి చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా టీజర్ను క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ నెల 13న ఈ చిత్రంలో ని ఫస్ట్ లిరికల్ వీడియోను రిలీజయ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ జీ టీవీ వారు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వెలువడుతున్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బివియస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.