విష్ణు సంచలన వ్యాఖ్యలు.. వారి రాజీనామా విషయం మీడియా ద్వారానే తెలిసింది!
on Oct 18, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి విజయం సాధించిన సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబు, మా నూతన కార్యవర్గంతో కలిసి ఈరోజు(సోమవారం) ఉదయం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా తనకు మీడియా ద్వారానే తెలిసిందని అన్నారు. వారి రాజీనామా లేఖలు తమకు ఇంకా అందలేదని, అవి అందిన తర్వాతే వాటిపై స్పందిస్తానన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, మా అసోయేషన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని విష్ణు పేర్కొన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. విష్ణు 'మా' కు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని.. అదొక బాధ్యత, గౌరవ ప్రధమైన హోదా అని అన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంచు లక్ష్మి, బాబూమోహన్, శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి తదితరులు ఉన్నారు.
Also Read