`మహా సముద్రం`.. స్టోరీలైన్ అదేనా?
on May 18, 2021
`ఆర్ ఎక్స్ 100` వంటి సంచలన విజయం తరువాత అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రం `మహా సముద్రం`. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంతమేర చిత్రీకరణ పూర్తయింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో తాత్కాలికంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే.. `మహా సముద్రం` స్టోరీలైన్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల కథగా `మహా సముద్రం` తెరకెక్కుతోందట. ఒకరిపై ఒకరు ద్వేషాన్ని తీర్చుకోవడానికి ఆ ఇద్దరు యువకులు ఏం చేస్తారు? ఈ క్రమంలో వాళ్ళకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందట. మరి.. ఈ స్టోరీలైన్ ముచ్చట ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `మహా సముద్రం`కి `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛేతన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.