`పుష్ప`.. ఒక్కో పార్ట్ కి ఒక్కో విలన్?
on May 18, 2021
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప`. యాక్షన్ థ్రిల్లర్ గా తయారవుతున్న ఈ సినిమాలో ``తగ్గేదే లే`` అంటూ నెవర్ సీన్ బిపోర్ లుక్ లో కనిపించనున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. రెండు భాగాలుగా సందడి చేయనుంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న `పుష్ప`లో కథానుసారం పార్ట్ కో విలన్ ఉంటాడట. మొదటి భాగంలో మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా దర్శనమిస్తే.. రెండో భాగంలో మరో బ్యాడీ ఉంటాడట. ఆ పాత్రలోనూ ఓ పాపులర్ ఆర్టిస్ట్ కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాదు.. ఫాహద్ పాత్ర తొలి భాగంతోనే అంతమవుతుందని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
`పుష్ప`లో కన్నడ కస్తూరి రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. `జబర్దస్త్` బ్యూటీ అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆరు నెలల గ్యాప్ లో `పుష్ప` రెండు భాగాలను రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్.