ఎనిమిదేళ్ల తర్వాత 'మహాసముద్రం'తో తిరిగొస్తున్నా.. సిద్ధార్థ్ ఎమోషనల్ ట్వీట్
on Oct 31, 2020
విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరో శర్వానంద్, ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కలయికలో 'మహాసముద్రం' చిత్రం రూపొందుతోంది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో నటిస్తున్నందుకు హీరో సిద్ధార్థ్ ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, "ఎనిమిదేళ్లలో నా మొదటి తెలుగు సినిమా 'మహాసముద్రం'కు వచ్చే నెల నుంచి పనిచేయబోతున్నాను. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్తో, గొప్ప సహ నటులతో పనిచేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ శుభాకాంక్షలు కావాలి" అని ఆయన ట్వీట్ చేశారు. దీనికి శర్వానంద్, అదితిరావ్ హైదరి, అనిల్ సుంకర్, అజయ్ భూపతి పేర్లను ట్యాగ్ చేశారు.
సిద్ధార్థ్ తెలుగులో నటించిన చివరి స్ట్రయిట్ ఫిల్మ్ 2013లో వచ్చిన 'జబర్దస్త్'. నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన ఆ మూవీలో సమంత హీరోయిన్. అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మధ్యలో సిద్ధార్థ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఇన్నాళ్ల తర్వాత స్ట్రయిట్ సినిమాతో 2021లో రానున్నాడు.
Also Read