'దృశ్యమ్' సీక్వెల్కు సన్నాహాలు షురూ!
on May 22, 2020
ఇటీవలి కాలంలో మోహన్లాల్ చేసిన సినిమాల్లో చెప్పుకోదగ్గది 'దృశ్యమ్'. ఒరిజినల్ ఎంత సక్సెస్ అయ్యిందో, రీమేక్ అయిన ప్రతి చోటా అలాంటి సక్సెస్నే ఆ సినిమా చూసింది. వెంకటేశ్ చేసిన తెలుగు రీమేక్ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే కదా. తాజాగా 'దృశ్యమ్' సీక్వెల్ మోషన్ పోస్టర్ను ఆ సినిమా నిర్మాతలు రిలీజ్ చేశారు. ఆ మోషన్ పోస్టర్లో మోహన్లాల్ లుక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఒరిజినల్ను రూపొందించిన జీతు జోసెఫ్ ఈ మూవీనీ డైరెక్ట్ చేయనున్నాడు. ఆ సినిమాలో నటించిన కొంతమంది నటీనటులు ఈ సినిమాలోనూ ఉంటారనీ, మిగతా తారాగణం విషయంలో చర్చలు నడుస్తున్నాయనీ ఆయన తెలిపాడు.
లాక్డౌన్ ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి షూటింగ్ను నిర్వహించనున్నారు. భార్య, ఇద్దరు కూతుళ్లతో హాయిగా జీవనం గడిపే ఓ మధ్యతరగతి వ్యక్తి జీవితం చుట్టూ ఒరిజినల్ స్టోరీ నడవడం మనం చూశాం. కూతురితో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిన ఒక పోకిరిని భార్య హతమారిస్తే, ఆ నేరం బయటపడకుండా ఆ వ్యక్తి ఎలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో చూశాం. ఈ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. సీక్వెల్లో జీతు జోసెఫ్ ఎలాంటి కథ చెప్పనున్నాడన్నది ఆసక్తికరం. ఒరిజినల్ తరహాలోనే ఈ సీక్వెల్ కూడా హిట్టయితే, అది కూడా మిగతా భాషల్లో రీమేక్ కావడం ఖాయం.