రాశీ ఖన్నా ఫేవరేట్ హ్యూమన్/ యాక్టర్ విజయ్ సేతుపతి అంట!
on Aug 2, 2021
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సీజన్ తర్వాత దర్శక ద్వయం మరో భారీ వెబ్ సిరీస్పై దృష్టి పెట్టారు. ఈసారి వారు రూపొందిస్తోన్న సిరీస్లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ సేతుపతితో మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రాశీ, తన ఎగ్జయిట్మెంట్ను దాచుకోలేకపోయింది. సేతుపతిని తన అభిమాన మనిషిగా, నటునిగా ఆమె అభివర్ణిస్తూ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టడం విశేషం.
విజయ్ సేతుపతితో దిగిన ఓ సెల్ఫీని షేర్ చేసిన రాశి, "మూడోసారి నా ఫేవరేట్ హ్యూమన్/ యాక్టర్తో కలిసి నటిస్తున్నాను." అని దానికి క్యాప్షన్ పెట్టింది. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'సంగతమిళన్', 'తుగ్లక్ దర్బార్' సినిమాలు చేశారు. వీటిలో రెండో సినిమా విడుదల కావాల్సి ఉంది.
అంతకు ముందు విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు షాహిద్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన ఓ వీడియోలో చెప్పాడు. "సెట్ మీదకు నన్ను త్వరగా పిలవండి రాజ్ అండ్ డీకే. విజయ్ సేతుపతితో ఫ్రేమ్ షేర్ చేసుకోవడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. క్షమించు రాశీ ఖన్నా.. సెట్లో నీకు బాగా అలవాటుపడిపోయాను." అని అతను సరదాగా చెప్పుకొచ్చాడు.
షాహిద్, రాశి జంటగా నటిస్తోన్న తొలి ప్రాజెక్ట్ ఇదే. అలాగే అటు రాజ్ అండ్ డీకేతో కానీ, ఇటు విజయ్ సేతుపతితో కానీ అతను కలిసి పనిచేస్తున్న తొలి ప్రాజెక్ట్ కూడా.