అక్టోబర్ 7 పెళ్లిరోజుకి చైతూ-సమంత వ్యవహారం తేలిపోనుంది!
on Sep 22, 2021
కొద్ది రోజులుగా టాలీవుడ్ హాట్ టాపిక్స్లో నాగచైతన్య-సమంత ట్రబుల్డ్ రిలేషన్షిప్ టాప్ ప్లేస్లో ఉంటూ వస్తోంది. సమంత ప్రతి మూవ్మెంట్ ఇప్పుడు మీడియాను ఆకర్షిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని మీడియా మాత్రమే కాదు, నేషనల్ మీడియా సైతం సమంతకు సంబంధించిన కథనాలను రెగ్యులర్గా ప్రచురిస్తోంది, ప్రసారం చేస్తోంది. ప్రస్తుతం చైతూ, సామ్ కలిసి ఉండట్లేదనేది రూఢిగా వినిపిస్తోన్న విషయం. సమంత చెన్నైలో ఎక్కువగా గడుపుతుంటే, చైతూ తన తండ్రి నాగార్జున ఇంటికి షిఫ్ట్ అయ్యాడనేది ఇన్సైడ్ టాక్.
మొన్న భర్త చైతూ సినిమా 'లవ్ స్టోరి' ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగితే, సమంత హైదరాబాద్లో కాకుండా చెన్నైలో త్రిష, కీర్తి సురేశ్, కల్యాణి ప్రియదర్శినిలతో పార్టీలు చేసుకుంటూ కనిపించింది. అదివరకు గోవాకు తన ఫ్రెండ్తో వెళ్లి జాలీగా గడిపివచ్చింది. ఇలా ఆ ఇద్దరూ రెండు నెలల నుంచీ విడివిడిగానే కనిపిస్తున్నారు. దీంతో ఆ ఇద్దరూ విడిపోవడానికి నిశ్చయించుకున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
చైతూను పూర్తిగా ఉపేక్షిస్తోన్న సమంత, మామ నాగార్జునకు సంబంధించిన విషయాలపై మాత్ర వెంటనే రెస్పాండ్ అవుతుండటం మాత్రం గమనించాల్సిన అంశం. ఆగస్ట్ 29 నాగార్జున బర్త్డేకి ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన సామ్, ఆయనను "ఫినామినా" అంటూ కీర్తించింది. అలాగే సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయనను తలచుకుంటూ నాగార్జున చేసిన ట్వీట్ను రిట్వీట్ చేసింది సామ్. "This is so beautiful @iamnagarjuna mama" అని రాసింది.
దీంతో సమంత మైండ్లో ఏముందో అర్థంకాక అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియాలో సమంతపై నెగటివ్ కామెంట్స్ పెడుతూ వచ్చిన అక్కినేని ఫ్యాన్స్, రెండు రోజుల నుంచీ ట్రోలింగ్కు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే, అక్టోబర్ 7 చైతూ-సమంత పెళ్లిరోజు వస్తుందనీ, అప్పటికి వారి వ్యవహారంపై క్లారిటీ వస్తుందనీ వారు అనుకుంటున్నారు.
Also Read