బాలయ్య టాక్ షో సందడి షురూ.. గెస్ట్ లు ఎవరో తెలిస్తే షాక్!
on Oct 13, 2021
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న సంగతి తెలిసిందే. 'అన్ స్టాపబుల్' పేరుతో త్వరలోనే బాలయ్య బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఆహా ఈ షో గురించి 'బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. అన్ స్టాపబుల్' అంటూ ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తోంది. ఇక ఈ షోని కూడా అదే రేంజ్ లో గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు.
'అన్ స్టాపబుల్' అంటూ బాలయ్య సందడి మొదలు కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఈ షో ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ లోని నోవోటెల్ లో గ్రాండ్ గా జరగనుంది. రేపే ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ షోకి గెస్ట్స్ గా టాలీవుడ్ టాప్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ(చిరంజీవి, రామ్ చరణ్), అక్కినేని ఫ్యామిలీ(నాగార్జున, నాగ చైతన్య, అఖిల్), మంచు ఫ్యామిలీ(మోహన్ బాబు, విష్ణు, మనోజ్) తో పాటు పలువురు స్టార్స్ ఈ షోలో పాల్గొననున్నారని సమాచారం.
బాలయ్య పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ.. ఆయనిది చిన్న పిల్లాడి మనస్తత్వం అని, అందరితో చాలా సరదాగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఈ 'అన్ స్టాపబుల్'తో బాలయ్య అల్లరిని ప్రేక్షకులు చూడనున్నారన్నమాట. మరి ఈ షోతో బాలయ్య ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి.