అజయ్ దేవగణ్ ఇకపై ఏపీ బ్రాండ్ అంబాసిడర్..!
on Apr 12, 2016
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం విభాగానికి బాలీవుడ్ స్టార్ కపుల్స్ అజయ్ దేవగణ్, కాజోల్ నియమితులయ్యారు. ఏపీ ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చిన అజయ్ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. పలు విషయాలపై అజయ్ , చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్, కాజోల్ జంటను ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీని ప్రమోట్ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



