సపరేట్గా అల్లు శిరీష్ స్టే
on May 5, 2020
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ది ఉమ్మడి కుటుంబమే. ముగ్గురు కుమారుల్లో ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. అయినా మొన్నటివరకూ అందరూ ఒకే ఇంటిలో ఉండేవారు. సతీ సమేతంగా, పిల్లలతో కలిసి అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్ కూడా తండ్రి ఇంటిలో ఉన్నారు. అయితే లాక్డౌన్కి ముందు అల్లు శిరీష్ సపరేట్ అయ్యారు. ఇప్పుడు ఆయన తల్లితండ్రులతో కాకుండా సపరేట్గా ఉంటున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ ఈ సంగతి చెప్పారు. లాక్ డౌన్ రావడం, ఒక్కడినే ఉండడంతో అన్నయ్య పిల్లలను బాగా మిస్ అవుతున్నానని ఆయన తెలిపారు.
"లాక్ డౌన్ అనౌన్స్ చేసినప్పుడు నేను హ్యాపీగా లేను. ఒక్క చోట ఉండడం నాకిష్టం ఉండదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. అందుకని, లాక్ డౌన్ నిర్ణయం నచ్చలేను. పోను పోను మన మంచికే అని అర్థం అయింది. ఈ సమయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండడం కష్టమే. పెద్దన్నయ్య కుమార్తె అన్విత, బన్నీ పిల్లలు అయాన్, అర్హతో వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నా. వాళ్ళను చాలా మిస్ అవుతున్నా. నేను ఒక్కడినే ఉంటున్నా... బుక్స్ నాకు కంపెనీ ఇస్తున్నాయి. అలాగే, సినిమాలు ఎక్కువ చూస్తున్నా" అని అల్లు శిరీష్ అన్నారు.