దర్శకుడితో రాజమౌళి కుమారుడికి అభిప్రాయ బేధాలు?
on May 7, 2020
దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే ఇంట్రెస్ట్. ఓ వైపు తండ్రి సినిమాలకు సెకండ్ యూనిట్ దర్శకుడిగా పని చేస్తూ... మరోవైపు ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. మొదటి ప్రయత్నంగా 'ఆకాశవాణి' అనే సినిమా నిర్మిస్తున్నాడు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విని గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దాదాపుగా సినిమా పూర్తయింది. మరో పది శాతం సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించాలి. ఈ సమయంలో దర్శకుడితో ఎస్ఎస్ కార్తికేయ అభిప్రాయబేధాలు వచ్చినట్టు ఫిల్మ్ నగర్ గుసగుస.
సినిమా ఫైనల్ అవుట్ పుట్ పట్ల కార్తికేయ సంతోషంగా లేరని సమాచారం. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు దర్శకుడి తో డిస్కస్ చేసిన దానికి... షూటింగ్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ మీద అ చూసిన సన్నివేశాలకు డిఫరెన్స్ ఉందని ఆయన ఫీల్ అయ్యారట. అయితే... దర్శకుడు అవుట్ పుట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు వినికిడి. ఈ సినిమా నుండి కార్తికేయ తప్పుకోవాలి అనుకుంటున్నారట. ఇప్పటి వరకు అతను ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరైనా ఇస్తే సినిమా వాళ్లకు హ్యాండోవర్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమాకు కార్తికేయ సోదరుడు, కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.