'ఆచార్య'కు ఏమైంది?
on Mar 14, 2020
చిరంజీవి సినిమా అంటే చాలు.. అందరి చూపులూ దాని మీదే ఉంటాయి. తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, 'ఖైదీ నంబర్ 150'తో సెకండ్ ఇన్నింగ్స్ను గ్రాండ్గా స్టార్ట్ చేసిన చిరంజీవి, తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 'సైరా' చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ ఆశించిన రీతిలో ఆడకపోయినా ఆయన ప్రయత్నాన్ని అందరూ అప్రిషియేట్ చేశారు. ఇప్పడు ఆయన 'ఆచార్య' అనే మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. సాధారణ ప్రజానీకంలోనే కాకుండా బిజినెస్ వర్గాల్లో ఈ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కారణం.. డైరెక్టర్ కొరటాల ట్రాక్ రికార్డ్. అతను డైరెక్ట్ చేసింది నాలుగే సినిమాలు. అవన్నీ ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర అధిక కలెక్షన్లు వసూలు చేశాయి. 'మిర్చి'తో మొదలైన అతడి విజయ పరంపర.. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాలతో కొనసాగుతూ వచ్చింది. 'ఆచార్య' మూవీతో వరుసగా ఐదో హిట్పై అతను కన్నేశాడు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ, రాంగ్ రీజన్స్తో 'ఆచార్య' వార్తల్లో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ను రామ్చరణ్ చేయాలనుకుంటే, 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్ పూర్తయ్యే దాకా మరో సినిమా చేయడానికి వీల్లేదని రాజమౌళి నిబంధన పెట్టడంతో అది సాధ్యపడలేదు. అతడి స్థానంలో ఆ క్యారెక్టర్ చేయడానికి సూపర్ స్టార్ మహేశ్ ముందుకు వస్తే, మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యతిరేకతతో దాన్ని పెండింగ్లో పెట్టారు. పది రోజుల నుంచీ దీనిపై ఇంత దాకా ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. లేటెస్ట్గా క్రియేటివ్ డిఫరెన్స్స్తో ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్గా ఎంపికైన త్రిష స్వయంగా ప్రకటించింది. ఇది అందర్నీ ఆశ్చర్యపరచింది. 'ఆచార్య' సినిమా విషయంలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటూ ఫిల్మ్నగర్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి విషయాలు సినిమాపై నెగటివ్ ప్రభావాన్ని కలిగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుముందైనా 'ఆచార్య' మూవీ రాంగ్ రీజన్స్తో కాకుండా మంచి విషయాలతో వార్తల్లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.