ENGLISH | TELUGU  

సంక్రాంతికి వస్తున్నాం.. 'గేమ్ ఛేంజర్'కి షాకిచ్చిన వెంకీ మామ!

on Nov 1, 2024

ఎఫ్-2, ఎఫ్-3 తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఈ సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఖరారు చేశారని, 2025 సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Sankranthiki Vasthunnam)

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ లో పంచెకట్టుతో, భుజాన గన్ తో వెంకీ మామ లుక్ అదిరింది. ఇక ఆయన పక్కన, మోడరన్ డ్రెస్ లో మీనాక్షి, చీరకట్టులో ఐశ్వర్య ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా గోడకి బోర్డు ఉంది. మొత్తానికి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అలాగే ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ సంక్రాంతి రేసులో ఉంది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా సంక్రాంతి బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. గతంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా తాము నిర్మించిన రెండు సినిమాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'లను ఇలాగే 2023 సంక్రాంతికి విడుదల చేయడం విశేషం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.