ఎవరికి బలిసింది.. మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?
on Jan 12, 2022
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారని, పుష్ప నిర్మాతలు కమ్మ సామజిక వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి ఆ సినిమాలో రెడ్లను విలన్స్ గా చూపించారని ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంతో పాటు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. " సినిమా వాళ్ళకి బలిసిందని ఒక ఎమ్మెల్యే అన్నారు. ఎవరికి బలిసింది సార్. ఎవరి కులం గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు. కుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెబుతున్నాను.. ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ లో మీ కులం వాళ్ళు కూడా ఉన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా అందరినీ ఆదరించేది సినీ పరిశ్రమే. పుష్ప నిర్మాత చౌదరినో కాదో కూడా మాకు తెలీదు. ఎందుకు సినీ పరిశ్రమకు కులాలు మతాలు ఆపాదిస్తున్నారు. ఎవరిని మెప్పించడానికి ఇదంతా చేస్తున్నారు." అని తమ్మారెడ్డి విరుచుకుపడ్డారు.
"గతంలో కొందరు నాయకులూ ఇలాగే రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డితిన్నారని.. మీరు కూడా గడ్డి తింటారా?. ఒక కులానికి చెందిన వారు ఓట్లేస్తేనే మీరు గెలవలేదు. అన్ని వర్గాల వారు వేస్తేనే గెలిచారు. ఇష్టమొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్లు అంటే అంత లోకువ అయిపోయారా?. వందల మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్టు సినిమా. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం. తామేమీ రాజకీయ నాయకుల్లాగా రూపాయి పెట్టి కోట్లు తినట్లేదు. మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆస్తులెన్ని? ఇప్పుడెన్ని?" అని తమ్మారెడ్డి నిలదీశారు. మూవీ టికెట్ ధరల ఇష్యూపై మాట్లాడిన తమ్మారెడ్డి.. ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా అది వాళ్ళ వ్యక్తిగతం. ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసేది ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే అని అన్నారు.
మూవీ టికెట్ ధరల ఇష్యూపై మాట్లాడిన తమ్మారెడ్డి.. ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా అది వాళ్ళ వ్యక్తిగతం. ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసేది ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే అని అన్నారు. ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు. మేమంతా ఒక్కటి కాదు. ఎవరి కుంపటి వాళ్లదే. మాకు సమస్య వస్తే ఛాంబర్ పరిష్కరిస్తుందని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read