అన్నయ్యతో తమ్ముడు.. బాక్సాఫీస్ కుమ్ముడు
on Feb 2, 2017
మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కళ్యాణ్లు హీరోలుగా ఒకే సినిమాలో నటిస్తే..బాక్సాఫీసు మామూలుగా షేక్ అవ్వదు..అసలు ఈ మాట వింటుంటేనే ఒళ్లు పులకరిస్తుంది కదూ.. కెరిర్లో శంకర్దాదా జిందాబాద్ చిత్రంలో అన్నయ్యతో ఆడిపాడాడు పవన్కళ్యాణ్. తెర మీద వీళ్లద్దరిని చూసిన అభిమానులు కేకలు, ఈలలతో థియేటర్లలో మోత పుట్టించారు. గెస్ట్ రోల్ కాకుండా మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఆశపడ్డారు. కానీ ఆ వెంటనే మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఇక తమ కల నెరవేరదని మెగా అభిమానులు డీలా పడిపోయారు.
అయితే అభిమానుల కోరిక మేరకు తొమ్మిది సంవత్సరాల తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. దీంతో ఫ్యాన్స్ ఆశలు మళ్లీ చిగురించాయి..ఇక్కడే మరో సమస్య వారిని వేధిస్తోంది..అన్నయ్యకు తమ్ముడికి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోవడం, రానున్న కాలంలో పవన్ పొలిటికల్గా బిజీ అవుతుందటంతో ఇక తమ కల కలగానే మిగిలిపోతుందని వారు భావించారు. సరిగ్గా అలాంటి సమయంలో ఎంపీ, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరూ ఊహించని ప్రకటన చేశారు.
చిరంజీవి, పవన్కళ్యాణ్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ నిర్మిస్తున్నట్లు దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఖైదీ నెం.150 చూసిన తర్వాత తాను తిరిగి సినిమా నిర్మాణంలోకి దిగాలని భావించానని..తన రీఎంట్రీ చిరంజీవి గారి సినిమాతోనే జరగాలనుకున్నానని..అది కూడా మల్టీస్టారర్ అయితే ఇంకా బాగుంటుందని చిరు, పవన్లని కలిసి చర్చించానని, వెంటనే వారిద్దరూ గ్రీన్సిగ్నల్ ఇచ్చారన్నారు. దీనిని త్రివిక్రమ్ ఒక్కడే హ్యండిల్ చేయగలడని భావించి డైరెక్టర్గా ఆయన్ను ఎంపిక చేశానని కళాబంధు తెలిపారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా అశ్వనీదత్ వ్యవహరిస్తారని సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు.
Also Read