సూపర్ స్టార్ రెంజే వేరు
on Jun 19, 2015
టాలీవుడ్ లో పెద్ద హీరోల క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ జాబితాలో మొదటి ప్లేస్ లో వుంటాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సౌత్ లో ఈయన క్రేజ్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెరిగిపోతూనే వుంది. లేటెస్ట్ గా మహేష్ శ్రీమంతుడు సినిమా నైజం హక్కులను 14 కోట్ల 40 లక్షలకు విక్రయించారంటే మహేష్ స్టామినా ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అభిషేక్ పిక్సర్స్ అధినేత అభిషేక్ హై ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ హక్కులు, అది కూడా నో రిటర్న్ అడ్వాన్స్ పద్దతిన తీసుకున్నారు. బాహుబలి తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన సినిమా ఇదే. ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.