మహేష్పై మరో విష ప్రచారం
on May 22, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న అభిమాన గణానికి అంతే లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న దక్షిణాది కథానాయకుల్లో తానూ ఒకడు. అయితే.. ఈమధ్య మహేష్పై కొన్ని చిత్ర విచిత్రమైన గాసిప్పులు పుట్టుకొస్తున్నాయి. యాంటీ మహేష్ ఫ్యాన్స్ వాటిని పని గట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. సచిన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా రాబోతోంది. దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేస్తున్నారు. ఈనెల 26న వస్తున్న ఈ సినిమా గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినీ స్టార్లంతా ఈ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకొంటూ ఓ ట్వీట్ చేశాడు. దానికి సచిన్ కూడా స్పందించాడు. అయితే ఈ ట్వీట్ల వెనుక ఏవో ఆర్థికపరమైన లెక్కలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహేష్ ఉత్తినే ట్వీట్ చేయలేదని, ట్వీట్కి ఇంత అని డబ్బులు వసూలు చేస్తున్నాడని యాంటీ మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ లాంటి సెలబ్రెటీలు ట్వీట్లు చేస్తే.. ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుందని, టికెట్లు బాగా తెగుతాయని, అందుకే చిత్రబృందం మహేష్కి డబ్బులు ఇచ్చి ట్వీట్లు చేయించిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సచిన్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి డబ్బులిచ్చి ట్వీట్లు చేయించుకోవడం అవసరమా?? సచిన్ లాంటి వ్యక్తికి ట్వీట్ చేసి మహేష్ డబ్బులు వసూలు చేస్తాడా?? ఇది నిజంగా విష ప్రచారం కాకపోతే మరేమిటి?? అభిమానం ఉండొచ్చు గానీ, దురభిమానంతో ఇలాంటి చిత్రవిచిత్రమైన గాసిప్పుల్ని సృష్టించేవాళ్లని ఏమనాలి?? మొత్తానికి మహేష్పై రేగిన ఈ వార్త... టాలీవుడ్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది.