గోపీ... రాశీ... మూడోసారి!
on Dec 14, 2018

ముచ్చటగా మూడోసారి గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించనున్నారని ఫిల్మ్నగర్ టాక్! కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టిన కొత్తలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటించారు. ఆ చిత్రమే ‘జిల్’. తర్వాత ‘ఆక్సిజన్’లో మరోసారి వీళ్లిద్దరూ జంటగా కనిపించారు. త్వరలో మరో చిత్రంలో జంటగా కనిపించనున్నారు. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఓ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మించనున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు రాశీ ఖన్నాను సంప్రతించగా... ఆమె అంగీకరించారని సమాచారం. విశాల్ హీరోగా తమిళంలో మూడు చిత్రాలు తీసిన తిరుకి, దర్శకుడిగా తెలుగులో తొలి చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ మరో సినిమా పట్టాలు ఎక్కించలేదు. బహుశా.. ఈ చిత్రమే మొదలయ్యే అవకాశాలున్నాయి. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు తిరు మాంచి యాక్షన్ కథను సిద్ధం చేశారట!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



