మరో మల్టీస్టారర్కి పవన్ గ్రీన్ సిగ్నల్....!
on Aug 11, 2016

పవన్ కల్యాణ్, వెంకటేష్ ఇద్దరూ కలసి గోపాల గోపాల సినిమాలో నటించారు. మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఊపిరిలూదారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి మరో సినిమా చేయబోతున్నారా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు నుంచి సెట్స్పైకి వెళ్తుంది. ఈసినిమాలో మరో కథానాయకుడూ కనిపిస్తారట. ఆ పాత్ర వెంకటేష్ చేస్తే బాగుంటుందన్నది త్రివిక్రమ్ ఆలోచన. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ కథల్ని వెంకీకి ఇచ్చింది త్రివిక్రమే. వెంకీతో ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఈ కథలో ఆ ఛాన్స్ దక్కిందట. వెంకీ అయితే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.. అని పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ కథ వెంకీకి వినిపించబోతున్నార్ట. వెంకీ కూడా ఓకే అనేస్తే... టాలీవుడ్లో మరో మల్టీస్టారర్కి కొబ్బరికాయ్ కొట్టుకొన్నట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



