గరివిడి లక్ష్మి బయోపిక్ లో నివేత థామస్
on May 2, 2024
ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద బయోపిక్ ల ట్రెండ్ నడుస్తు ఉంది. సమాజంలోని రకరకాల వ్యక్తుల జీవిత చరిత్రలని తెర మీదకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నివేత థామస్( Nivetha Thomas)కూడా బయోపిక్ లో నటించబోతుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది.
గరివిడి లక్ష్మి(Garividi Lakshmi)ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బుర్రకథ చెప్పడంలో గుంటూరు నాజర్ వంటి అగ్రగణ్యులు ఉన్నా కూడా తన కంటూ ఒక ప్రత్యేక బాణి ని ఏర్పరచుకొని ఎంతో కీర్తిని సంపాదించింది. అసలు ఆమె బుర్ర కథ చెప్పడం ప్రారంభిస్తే ఇంక జనం అన్ని పనులు మానుకొని ఆమె ప్రదర్శననని తిలకిస్తుంటారు. ఇప్పుడు లక్ష్మి బయోపిక్ లోనే నివేదిత నటిస్తుంది. ప్రముఖ అగ్రనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా గౌరీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గరివిడి లక్ష్మి అసలు పేరు రెడ్డి లక్ష్మి
నివేదిత 2008 లో వేరుతే ఓరు భార్య అనే మలయాళ మూవీతో బాలనటిగా పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 20 సినిమాలకి పైనే చేసింది.ఎన్టీఆర్ జై లవ కుశ, నాని జెంటిల్మన్ ,నిన్ను కోరి హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చాయి. పవన్ వకీల్ సాబ్, రజనీ దర్బార్ లో కూడా ముఖ్య పాత్రల్లో నటించింది.
Also Read