మహర్షి 50 రోజుల వేడుక వాయిదా
on Jun 27, 2019

తెలుగు నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల హఠాన్మరణం పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా సక్సెస్ వేడుకలు వాయిదా పడ్డాయి. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో వంశీపైడిపల్లి తెరకెక్కించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా 200 పైగా కేంద్రాల్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతుండడంతో ఈ సినిమా యూనిట్ రేపు హైదరాబాద్ శిల్పకళా వేదికగా 50 రోజుల వేడుకని ఘనంగా నిర్వహించాలని భావించింది. విజయ నిర్మల హఠాన్మరణంతో వేడుకని వాయిదా వేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నానిని ఆహ్వానించినారు కూడా, అయితే రేపు విజయ నిర్మల అంత్యక్రియలు జరగనుండగా మహేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. మహేష్ కుటుంబం విషాదంలో ఉండగా ఇలా సక్సెస్ సంబరాలు నిర్వహించడం బాగోదని భావించి వాటిని రద్దు చేసినట్టు చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



