30 రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా – పృథ్వి
on Jul 12, 2018
ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే చాలు కమెడియన్ పృథ్వీనే గుర్తుకువస్తాడు. చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఖడ్గంలో తను చెప్పిన ఆ డైలాగ్ తన కెరీర్నే మార్చేసింది. ఇప్పుడు పృథ్వీ ఏకంగా ఓ సినిమాలో హీరోగా కనిపించనున్నారట. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సయ్యద్ నిజాముద్దీన్ అనే నిర్మాత పృథ్వీ హీరోగా ‘మై డియర్ మార్తాండం’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. హరీష్ కె.వి. దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ఈపాటికే పూర్తయిపోయింది. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమాలో పృథ్వీ ఓ లాయర్గా కనిపించనున్నారు. అది కూడా 30 రోజుల్లో న్యాయవాది కావడం ఎలా అన్న పుస్తకం చదివి లాయరైన వ్యక్తిగా. క్రైమ్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా తనకి మరో మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నారు పృథ్వీ.