నలుగురి బాధ్యతలని మోస్తున్న ఫరియా అబ్దుల్లా
on Aug 30, 2024
యువ సామ్రాట్ నాగార్జున(nagarjuna)తనయుడు నాగ చైతన్య(naga chaitanya)కాంబోలో వచ్చిన మూవీ బంగార్రాజు. అందులో నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బంగార్రాజు మాకు దిక్కెవరంటూ చైతు తో పాటు ప్రేక్షకులని అలరించిన నటి ఫరియా అబ్దుల్లా. పక్కా హైదెరాబాదీ అయిన ఫరియా జాతి రత్నాలు లో కూడా జడ్జి గా ఉన్న బ్రహ్మానందంతో బెయిల్ ఇచ్చేయండంటు నవ్వులని పూయించింది. ఇప్పడు ఈ ముద్దుగుమ్మ సరికొత్త అవతారానికి సిద్ధం అయ్యింది.
కీరవాణి(keeravani)తనయుడు శ్రీ సింహా(sri simha)హీరోగా ఇది సంవత్సరాల క్రితం వచ్చిన మత్తువదలరా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా మత్తువదలరా 2 రాబోతుంది. శ్రీ సింహా సరసన ఫరియా అబ్దుల్లా జత కట్టగా ఈ నెల 13 న విడుదల కాబోతుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫరియా పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీలో నేనొక సాంగ్ రాయడం తో పాటు ఆ సాంగ్ కి కొరియో గ్రఫీ కూడా చేశాను. పైగా పాడింది కూడా నేనే. రేపు థియేటర్స్ లో అందరు ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది.
అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (mythri movie makers)నిర్మిస్తుండగా రితీష్ రానా(ritish rana)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. మొదటి భాగాన్ని మించి రెండవ భాగం విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని శ్రీ సింహా వ్యక్తం చేసాడు. కీరవాణి ఇంకో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు. టీజర్ కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read