ఎన్టీఆర్ పాంచజన్యాన్ని చిరంజీవి ఎంచుకోవడానికి కారణం ఇదే
on Aug 27, 2024
ఎన్ని దశాబ్దాలు అయినా సరే చిరు(chiranjeevi)తో పాటు అభిమానులు మర్చిపోలేని మూవీ ఇంద్ర(indra)డల్ గా సాగుతున్న చిరు కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇవ్వడంతో పాటు తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డు లు క్రియేట్ చేసింది. ఇక చిరు బర్త్ డే సందర్భంగా అగస్ట్ 22 న మరోసారి రీ రిలీజ్ అయ్యిన ఇంద్ర అన్ని చోట్ల ట్రెమండరస్ రెస్పాన్స్ ని అందుకుంది. ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న మూవీ లాగా థియేటర్స్ దగ్గర జన జాతర ని కూడా తలపించింది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వని దత్ కి చిరు ఒక గిఫ్ట్ ని ఇచ్చాడు.
ఇంద్ర ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్(ashwini dutt)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. చిరుకి ఎలాగైనా ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలనే కసితోనే దత్తు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ విషయం మూవీలోని ప్రతి ఫేమ్ మనకి స్పష్టంగా చెప్తుంది. అసలు ఇంద్ర ని దత్తు గారు తప్పితే మరొకరు తెరకెక్కించలేరన్న అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తం అవుతుంది. ఇక ఇంద్ర రీ రిలీజ్ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ని చిరు తన ఇంటికి పిలిచి సన్మానించాడు. ఈ సందర్భంగా దత్తు గారికి ఒక విలువైన వస్తువుని గిఫ్ట్ గా ఇచ్చాడు. బహుశా ఆ గిఫ్ట్ ని దత్తు గారు ఉహించి ఉండకపోవచ్చు. వైజయంతి బ్యానర్ లోగోలో నందమూరి తారకరామారావు కృష్ణుడు గా ఉన్న బొమ్మ ఉంటుంది. విజయం సాధించబోతున్నామనే గుర్తుగా విజయ శంఖాన్ని ఊదుతుంటాడు. దానినే పాంచజన్యం అని కూడా అంటారు. ఇప్పుడు ఆ పాంచజన్యాన్నే చిరు ప్రత్యేకంగా తయారు చేయించి దత్తు కి ఇచ్చాడు. దాంతో చిరుని ఆప్యాయంగా కౌగిలించుకున్న దత్తు చిరుకి పాదాభివందనం చేయబోయాడు. వద్దని వారించిన చిరు దత్తు ని హత్తుకొని మీలాంటి నిర్మాత దక్కడం మా అదృష్టం అని చెప్పారు.
డైరెక్టర్ బీ గోపాల్(b gopal)రచయిత చిన్నికృష్ణ(chinni krishna)డైలాగ్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్(paruchuri brothers)మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ(mani sharma) ల కి కూడా చిరు శాలువా కప్పి సన్మానించారు. ఈ మొత్తం వీడియోని వైజయంతీ మూవీస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంద్ర భవనంలో సత్కారం అనే టైటిల్ ని క్యాప్షన్ గా ఉంచింది.
Also Read