థియేటర్లలో మార్చి 14న చందమామ కథలు
on Mar 1, 2014
ఎనిమిది వేరు వేరు కథలను కలిపి ఒకే సినిమాలో చూపిస్తూ.. కొత్త రీతిలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "చందమామ కథలు". ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ చిత్రంలో నరేష్, ఆమని, మంచు లక్ష్మీ వంటి పలు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 14న విడుదల చేయనున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు ఇటీవలే మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూసామనే అనుభూతి కలుగుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.