టాలీవుడ్కు అందమైన అక్క దొరికిందండోయ్!
on Dec 29, 2017
ఓ పదేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా హవా సాగించిన భూమిక... తర్వాత్తర్వాత మిస్సమ్మ, అమరావతి... లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత యోగా మాస్టర్ భరత్ ఠాగూర్ ని వివాహం చేసుకొని నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. నాని ‘ఎంసీఏ’ లో భూమికకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పాలి. అందులో ఆమె చేసిన వదిన పాత్రకు మంచి స్పందన లభిస్తోంది.
తెలుగు సినిమాకు అందమైన అక్క, వదిన దొరికిందని పలువురు దర్శక, నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. కొందరు రచయితలైతే... అప్పుడే భూమికను దృష్టిలో పెట్టుకొని పాత్రలు కూడా క్రియేట్ చేసేస్తున్నారు. ప్రస్తుతం భూమిక బిజీ బిజీ.. తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. తెలుగులో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాలో చైతూ అక్క పాత్రను భూమిక పోషిస్తోంది.ఇందులో మాధవన్ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మాధవన్, భూమిక పెయిర్ గా నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా రూపొందిస్తున్న ‘కామోషీ’ అనే సినిమాలో కీలక పాత్రను భూమిక పోషిస్తోంది. బెస్టాఫ్ లక్ భూమికా.