బన్నీ మంత్రాలు మరీ మూడు రోజులేనా..?
on Jun 26, 2017

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ గత శుక్రవారం రిలీజైంది. విడుదలకు ముందు కాంట్రవర్సీ, ట్రైలర్ అదిరిపోవడంతో కలెక్షన్లు అదిరిపోతాయి అనుకున్నారంతా..అందుకు తగినట్లుగానే అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా డీజే రికార్డు సృష్టించింది. అయితే మ్యాట్నీ నుంచి సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రావడంతో..ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. రంజాన్ సెలవు కావడంతో జనం థియేటర్లకు వస్తారని ఆశించిన చిత్రయూనిట్కు నిరాశే ఎదురైంది. చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఇక సినిమా అయిపోందనుకున్నారో లేక మరేదైనా కారణమో కానీ ఎప్పుడో 50 రోజులకు పెట్టాల్సిన థ్యాంక్యూ మీట్ మూడు రోజులకే పెట్టేశారు. చూస్తుంటే డీజే ప్రమోషన్స్కు శుభం కార్డు వేసే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఉన్నట్లుందని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



