బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్!
on Oct 26, 2021
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో కమ్ బ్యాక్ హిట్ అందుకున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో ఛాన్స్ వచ్చినట్లుగా ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లో మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తాడని టాక్ వినిపిస్తోంది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అటు హీరోగా అఖిల్ కి ఫస్ట్ హిట్ ని అందించడంతో పాటు.. డైరెక్టర్ గా భాస్కర్ కి కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ కి.. గీతా ఆర్ట్స్2 బ్యానర్ మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భాస్కర్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని, ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని టాక్. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'లో అఖిల్ కి జోడీగా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.
Also Read