న్యూ ఇయర్ హాలిడేస్ ఎంజాయ్ చేసొచ్చి.. ప్రియుడితో ముంబైలో ప్రత్యక్షమైన రకుల్!
on Jan 5, 2022
ఈరోజు, జనవరి 5న ముంబై ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నాని. న్యూ ఇయర్ను జరుపుకోడానికి ఆ జంట ముంబై నుంచి బయటకు వేరే ప్రాంతానికి వెళ్లింది. తాము ఎక్కడికి వెళ్లిందనే విషయం అటు రకుల్ కానీ, ఇటు జాకీ కానీ వెల్లడించలేదు కానీ, సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటోలతో ఫ్యాన్స్నూ, ఫాలోయర్స్నూ ఆనందపరుస్తున్నారు.
డిసెంబర్ 25న జాకీ భగ్నానీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆ ఇద్దరూ జంటగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు. ఈరోజు ముంబైకి తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్లోకి వస్తూ, ఆ తర్వాత బయటకు వెళ్తూ వారు కనిపించారు. లూజ్ డెనిమ్, బ్లాక్ జాకెట్తో రకుల్ గార్జియస్గా కనిపించగా, బ్లాక్ జాకెట్, దాని మ్యాచింగ్ ట్రౌజర్స్ ధరించాడు జాకీ.
Also read: అత్తగారింట్లో 'కత్రినా' వండిన తొలి వంటకం ఏంటో తెలుసా?
జాకీతో తన అనుబంధాన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇదివరకు బయటపెట్టింది రకుల్. అతని చేతిని పట్టుకొని నడుస్తూ ఉన్న ఒక ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆమె, "థాంక్యూ మై లవ్! ఈ ఏడాది నువ్వు నాకు లభించిన బిగ్గెస్ట్ గిఫ్ట్వి. నా లైఫ్కు కలర్ను జోడించినందుకు థాంక్యూ, నన్ను నాన్స్టాప్గా నవ్విస్తున్నందుకు థాంక్యూ." అని ఆమె అప్పుడు రాసుకొచ్చింది.
Also read: ఈ టాప్ హీరోయిన్ల ఆస్తులెంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
జాకీ భగ్నానీ ముంబైకి చెందిన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. అతను ప్రముఖ నిర్మాత వషు భగ్నాని కుమారుడు. 2009లో 'కల్ కిస్నే దేఖా' సినిమాతో బాలీవుడ్లో నటునిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు.
Also Read