వైఎస్ కాంగ్రెస్ కొంపముంచుతారా?
Publish Date:May 23, 2012
Advertisement
రాష్ట్రంలో 18 అసెంబ్లీ,ఒక లోక్ సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పాల్గొంటున్న కాంగ్రెసుపార్టీ ప్రస్తుతం ఒక విచిత్రమైన సందిగ్థంలో పడింది. వైఎస్ కృషితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. కానీ, వైఎస్ పేరుతో జనం మధ్య తిరుగుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సభలకు పెద్దమొత్తంలో జనం తరలివస్తున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు సామాన్య,మధ్యతరగతి ప్రజలకు ఎంతో కొంత మేలు చేశాయి.వారికి జరిగిన ప్రయోజనాలను ఎన్నికల ప్రచారంలో చెబుదామని కాంగ్రెస్ నాయకులు అనుకుంటే సిబిఐదర్యాప్తులో వైఎస్ పేరు కూడాప్రముఖంగా వినిపిస్తోంది.దీంతో వైఎస్ పేరును ఉచ్ఛరించడానికే వారు భయపడుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ కూడా తప్పుచేశారన్నా భావన కల్పించేలా సిబిఐ ఛార్జిషీటు ఉండటంతో ఆయన పాపాలు ఎవరు భరించారన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది.వైఎస్ హయాంలో అక్రమాలు ఉంటే ఆ పాపాలు మాత్రం తమ ఖాతాలోకి రావని,మంచి మాత్రమే తమ పార్టీకి వస్తుందని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి అంటున్నారు. అయితే అవినీతి,అక్రమాల నేపథ్యంలో వైఎస్ పేరును పార్టీలో నుంచి ఎంత త్వరగా చెరిపేస్తే అంత మంచిదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత టి.హనుమంతరావు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సిబిఐ ఛార్జిషీటులో దివంగత నేత వైఎస్ పేరును చేర్చటం కాంగ్రెస్ పార్టీ అలజడి సృష్టించింది. ఈ పాపాన్ని ఎవరు మోయాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ys-rajasekhara-reddy-congress-24-14237.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





