జగన్ జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టలేరు.!

Publish Date:Aug 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల  సమావేశాలు ఈ నెల   17 నుంచీ ప్రారంభం కానున్న తరుణంలో.. జగన్, వైసీపీ సభ్యుల గైర్హాజర్ నిర్ణయం మళ్లీ సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. వైసీపీ సభ్యుల సభా బహిష్కరణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

  నిబంధనల ప్రకారం రాని  ప్రతిపక్ష హోదా  కోసం మంకుపట్టు పడుతూ సభకు రాకపోవడంపై విమర్శల నేపథ్యంలో ప్రముఖ విశ్లేషకుడు మధుసూదన్ రడ్డి తెలుగువన్ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  అసెంబ్లీకి జగన్ ముఖం చాటేయడానికి అసలు కారణం భయం అన్నారు.  ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. 

అయితే ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయానికి.. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను అవమానించినట్లుగానే ఇప్పుడు తానూ అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందన్న భయమే కారణమని చెప్పారు.   అసెంబ్లీలో  తన తప్పులు బయటపడతాయనే భయంతో పాటు, సభలో ఎదురయ్యే విమర్శలు, అవమానాలనూ తలచుకుని భయపడుతుండటg వల్లే జగన్ అసెంబ్లీకి గైర్హాజరౌతున్నారని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే రాదనీ, జనం అందుకు అవసరమైనంత మంది సభ్యులను గెలిపించి సభకు పంపాల్పి ఉంటుందనీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.  

సభకు హాజరు కాకుండానే నిస్సిగ్గుగా జనగ్, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలూ జీత భత్యాలు తీసుకుంటున్నారని విమర్శింారు.  సామాన్య ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే జీతాలు కోత విధిస్తారనీ, మరి శాసనసభకు రాని ఎమ్మెల్యేలకు ప్రజల సొమ్ముతో జీతాలు ఎందుకు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు.  

చట్టసభలకు వరుసగా గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలన్నారు. సభకు 60 రోజుల పాటు హాజరుకాని పక్షంలో స్పీకర్ అధికారాలను ఉపయోగించి అనర్హత నిర్ణయం తీసుకోవాలన్నారు.  వైసీపీ తీరు ఇలాగే ఉంటే.. ఆ పార్టీ భవిష్యత్ లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న మధుసూదన్ రెడ్డి.. ఆ విధంగా జగన్ తన జీవితంలో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేరన్నారు.  రాజ్యాంగబద్ధమైన సభను గౌరవించకుండా, ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. 

YS Jagan, AP Assembly Sessions, YSRCP, Andhra Pradesh Politics, TOne News

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు.
వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.
ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఒక వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి.. తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు.
రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.
తాజాగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.
కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్ సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రధానంగా పేదలు, మహిళలు, రైతులు, యువతలకు ప్రయోజనం చూకూర్చే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న  ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. 
 మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి.
గత ఏప్రిల్ నెలలో మహరాష్ట్ర నుంచి తెలంగాణలో ఎంటరై అయి ఇద్దరిని చంపేసిన గజరాజు ఉదంతం తెలిసిందే. తాజాగా  ప్రస్తుతం మరో  ఏనుగుల గుంపు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని ఆటవిశాఖ అధికారులు చాటింపు వేశారు.
Publish Date:May 23, 2023
If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.