ఈ దొంగకు మీరూ ఫాన్ అయిపోతారు!!

Publish Date:May 20, 2022

Advertisement

మార్చి 19, 1987 ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలో అరవింద్ ఇనామ్‌దార్‌కు అత్యవసరమైన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో అరవింద్ కు త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ వారి ఒపెరా హౌస్‌ శాఖలో ఏదో తేడా జరుగుతుందనే విషయం చెప్పారు. 


ముంబై నగరంలోని ఒపెరా హౌస్ ప్రాంతంలో చాలా ఆభరణాల దుకాణాలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ(టి.బి.జెడ్)లో సిబిఐ దాడి జరిగింది. బృందం లోపలికి వచ్చి, షట్టర్ క్రిందికి లాగి, సిబ్బందిని ఇంకా ఖాతాదారులను "రిజిస్టర్లను పరిశీలించేవరకు వేచి ఉండండి కాల్ ద్వారా అరవింద్ తెలుసుకుంటారు"  అని చెప్పారు. 


సాధారణంగా సిబిఐ దాడులు జరిగినప్పుడు ఎలాంటి ఫోన్ కాల్స్ జరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ పాటిస్తుంది సిబిఐ. అలాగే ఇక్కడ కూడా జరిగింది. కానీ అదంతా జరిగిన తర్వాతనే ఆయనకి తేడా కొట్టింది. సిబిఐ టీమ్ చాలా ఆభరణాలతో బయలుదేరినట్లు ఇనామ్‌దార్‌కు కాల్ చేసి చెప్పారు ఆభరణాల షాప్ లో పనిచేసేవాళ్ళు.  అది అతనికి వింతగా అనిపించింది.


అరవింద్ అక్కడికి తన టీమ్ తో ఆ ఆభరణాల షాప్ ల దగ్గరకు చేరుకున్నాక తెలిసిన  విషయాలు అతనికి మరింత విచిత్రంగా అనిపించాయి.


ఆ సిబిఐ టీమ్ మొత్తం అక్కడే ఉంది. కేవలం వారి నాయకుడు - మోహన్ సింగ్ తప్ప. అసలు ఈ మోహన్ సింగ్ ఎవరూ అనే అనుమానం అందరికీ వస్తుంది. అదే అనుమానం అరవింద్ కు కూడా వచ్చింది.  లోతుగా విచారిస్తే ఇది అసలు సిబిఐ బృందం కూడా కాదు, వారు ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న బృందసభ్యులు మాత్రమే అని ఆయనకు తెలిసింది. ఇదేంటి ఏదో ఒక ఉద్యోగం కోసం సిబిఐ లా రైడ్ చేయడం ఏంటి అని అనుమానం ఈ దొంగతనం గురించి మొదటిసారి వినేవాళ్లకు కూడా వస్తుంది. 


విషయం ఏమిటంటే  "ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్ట్ల కోసం డైనమిక్ గ్రాడ్యుయేట్లు కావాలి" అని కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రకటన వేయించాడు మోహన్ సింగ్. అసలే నిరుద్యోగుల దేశం కదా. ఆ ప్రకటన చూసి ఇంటెలిజెన్స్ విభాగం మీద ఆసక్తి ఉన్న ఎంతో మంది అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌కి రావాలని ప్రకటనలో ఆయన చెప్పారు. అలా మోహన్ సింగ్  చివరకి ఇరవై ఆరుగురు వ్యక్తులని ఎన్నుకున్నాడు. వారిలో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నా దానికంటే మెరుగైన ఉద్యోగం కోసం వెతుకుతున్నవాళ్ళు కొందరు ఉన్నారు.  


ఈ ఇరవై ఆరు మందిని మరుసటి రోజు ఉదయం 11 గంటలకు రిపోర్ట్ చేయమని ఆ తరువాత మోహన్ వారికి గుర్తింపు కార్డులను అందజేస్తానని చెప్పాడు. వచ్చిన గంట తరువాత, సింగ్ వాళ్ళందరిని బస్సులో ఎక్కించి  "మనమిప్పుడు ట్రయల్ రెయిడ్ కోసం టి.బి.జెడ్ కు వెళ్తున్నాము. కాబట్టి మీరు మీ బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫైనల్ గా జాబ్ కు సెలెక్ట్ అవుతారు" అని చెప్పాడు వాళ్లకు.


బస్సు ప్రయాణంలో వాళ్ళందరిని ఆయన ఎంత తయారు చేసారంటే అక్కడికి చేరాక వారి ప్రవర్తన టి.బి.జెడ్ సిబ్బంది అందరికి నిజమైన సిబిఐ అధికారుల రైడ్ లాగే అనిపించింది. దాడి జరుగుతున్న మధ్యలో సింగ్ చుట్టూ తిరుగుతూ కొన్ని షోకేసులలో ఆభరణాలను 'శాంపిల్స్' గా తీసుకొని వాటిని పాలిథీన్ సంచులలో పెట్టి, ప్రభుత్వ ముద్రను చూపించే స్లిప్‌లతో సంచులని మూసారు.


మోహన్ ఆ సంచులను తీసుకుంటూ దగ్గరలో ఉన్న మరో దుకాణంలో తనిఖీ చేస్తాను, నాకోసం వెయిట్ చేయండి అని తన సిబ్బందికి చెప్పాడు. తరువాత అతను బస్సులో ఎక్కి, తిరిగి హోటల్‌కు వెళ్లి, ఖాళీ చేసి, టాక్సీ ఎక్కి, మధ్యలో ఒక చోట ఆటోలోకి మారి వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా నిజమైన సీబీఐ ఆఫీసర్  అరవింద్ అక్కడ చేరుకున్నాక తెలుసుకోగలిగాడు. ఆ తరువాత మోహన్ సింగ్ కోసం ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా అతడు దొరకలేదు. 

కొన్ని నెలల తరువాత తాజ్‌లో విచారించినప్పుడు మోహన్ సింగ్ త్రివేండ్రంకు చెందినవాడు అని తెలిస్తే, పోలీసులు దేశం మొత్తం అప్రమత్తం చేయించి, ఒక బృందాన్ని కేరళకు పంపారు. జార్జ్ అగస్టిన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తిని అక్కడ అరెస్టు చేశారు, కాని అతను ఒక చిన్న దొంగ అని తెలియడంతో అతనిని వదిలేసారు. పోలీసులు దేశ వ్యాప్తంగా ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా మోహన్ సింగ్ ను పట్టుకోలేకపోయారు. చివరికి మోహన్ సింగ్ దొరకలేదు. 


ఈ దోపిడీకి  మోహన్ సింగ్ ఎంతో తెలివిగా ఆలోచించాడు. చిన్నా చితకా హోటల్‌ను ఉపయోగించకుండా, చాలా ఖరీదైన తాజ్ నే వాడాడు. ఇంటెలిజెన్స్ వర్గాలు మరీ డబ్బా హోటల్స్ లో ఇంటర్వ్యూలు చేస్తాయా అనే అనుమానం రాకూడదు అండ్ మోహన్ సింగ్ మీద అటు హోటల్ వారికి, ఇటు అతని దగ్గరకు వచ్చిన వారికి అనుమానం రాకుండా.  అతడు కొత్తగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒకరి గురించి మరొకరికి తెలియదు అంతే కాదు మోహన్ సింగ్ గురించి కూడా తెలియదు కాబట్టి వాళ్ళను తెలివిగా వాడేసుకున్నాడు. ఆభరణాల షాప్ లో సిబ్బందికి రియల్ సీబీఐ అనిపించేలా వాళ్ళను ప్రిపేర్ చేయడమే అతని తెలివికి నిదర్శనం. చివరి విషయం ఏంటంటే ఇంతచేసినపుడు ఇదంతా సినిమాటిక్ గా ఉందని అనుకుంటారు అందరూ. కానీ విచిత్రంగా సినిమాటిక్ రేంజ్ లోనే అతను తప్పించుకుని మాయమైపోయాడు. ఎక్కడైనా తేడా జరిగితే అనే జంకు లేకుండా ఇంత చేసాడు అంటే అతడు ఎంతో ధైర్యవంతుడు కదా.


దొంగే కావచ్చు, తప్పే చేసుండచ్చు. కానీ దొరకకుండా తప్పించుకోవడం అతడి తెలివితేటలు విన్న తరువాత దొంగను కూడా హీరోలా మెచ్చుకునేస్తారు ఖచ్చితంగా.


ఇప్పుడు మీకు ఏవైనా సినిమాలు గుర్తొస్తాయేమో!!


                              ◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.