అత్యుత్సాహంతో వైసీపీ బొక్క‌బోర్లా.. పాయె..ప‌రువు మొత్తం పాయే!

Publish Date:Jan 21, 2025

Advertisement

దొర‌క్క దొర‌క్క కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే త‌ర‌హాలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత వైసీపీ నేత‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ‌ హ‌డావుడి చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఏడు నెల‌ల కాలంలో కూట‌మి పార్టీల మ‌ధ్య ఎక్క‌డా విబేధాలు పొడ‌ చూప‌లేదు. ఐక‌మ‌త్యంగా క‌లిసి రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా ఎలాంటి అంశం, అవకాశం దొర‌క‌డం లేదు. అయితే, గ‌త నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియ‌మించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. ప‌లువురు తెలుగుదేశం నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో కూట‌మి నేత‌ల మ‌ధ్య ఎలా అగ్గిరాజేయాలా అని  గోతికాడ  న‌క్క‌లా ఎదురుచూస్తున్న వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక రాబోతోంది.. ప్ర‌భుత్వం కూల‌బోతోంది అంటూ తెగ హ‌డావుడి చేశారు. అంతే కాదు.. కూట‌మి నేత‌లు మాట్లాడ‌ని మాట‌ల‌ను జోడించి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య గొడ‌వ‌ పెట్టేలా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా తీవ్రంగా శ్ర‌మించింది. కానీ, చివ‌ర‌కు బొక్క‌బోర్లా ప‌డింది. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభివృద్ధిలో భాగ‌స్వామి అవుతున్నారు. దీంతో కూట‌మిలోని బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు ఒకే పార్టీ నేత‌ల త‌ర‌హాలో గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క‌లిసి మెలిసి పని చేస్తున్నారు. అయితే, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి టీడీపీ నేత‌లు, ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కొన‌సాగిస్తూనే మంత్రి నారా లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌లు త‌మ అభిప్రాయాన్ని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేత‌ల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న డిమాండ్ తీవ్ర‌మైంది. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు తెలుగుదేశం వాద‌న‌ను స‌మ‌ర్ధించ‌గా.. మ‌రికొంద‌రు ఖండించారు. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక వ‌చ్చిందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోప‌క్క‌ లోకేశ్ ను తిట్టిన‌ట్లు జ‌న‌సేన పేరుతో పోస్టులు పెట్ట‌డం, ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తూ తెలుగుదేశం నేత‌ల పేరుతో పోస్టులు పెట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోష‌ల్ మీడియా పాల్ప‌డింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి డిమాండ్ పెరుగుతుండ‌టంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని అధిష్టానం పార్టీ క్యాడ‌ర్ కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.   

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లోకేశ్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీ బ‌లోపేతంలోనూ లోకేశ్ కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఇటీవ‌లే టీడీపీ స‌భ్య‌త్వాలు తొలిసారి కోటి దాటాయి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పార్టీ స‌భ్య‌త్వాలు  తీసుకోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం లోకేశ్ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  కార్య‌క‌ర్త‌ల‌కు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మ‌రో ప‌క్క‌ రాష్ట్రం అభివృద్ధిలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని తెలుగుదేశం నేత‌లు కోర‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకొని వెళ్లొచ్చు.. అదే స‌మ‌యంలో తెలుగుదేశం బ‌లోపేతానికి మ‌రింత‌గా కృషిచేసే అవ‌కాశం ఉంటుంది. అయితే, లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండ‌టంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌సేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఎవ‌రూ ఈ అంశంపై మాట్లాడొద్ద‌ని సూచించింది. దీంతో గ‌త నాలుగు రోజులుగా కూట‌మిప్ర‌భుత్వంలో చీల‌క తేవాల‌ని ప్ర‌య‌త్నించిన వైసీపీ సోష‌ల్ మీడియా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. 

గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ శ్రేణులుసైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి పార్టీల మ‌ధ్య చిన్న‌పాటి విబేధాలు రావ‌డం స‌హ‌జ‌మే. అవి టీ క‌ప్పులో తుఫాను లాంటివి. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా వైసీపీ నేత‌లు లోకేశ్ డిప్యూటీ సీఎం విష‌యంపై తెగ హ‌డావుడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయాల్సిన వైసీపీ.. కేవ‌లం కూట‌మి పార్టీల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు, లేనిపోని అస‌త్యాల‌తో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ పెట్టేందుకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ డిప్యూటీ సీఎం ఎపిషోడ్‌లో చివ‌రికి వైసీపీ పెద్ద ఫూల్ అయింద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై  ఫోక‌స్ చేస్తారా.. కూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య ఎప్పుడు విబేధాలు త‌లెత్తుతాయా అని గోతికాడ గుంట‌న‌క్క‌లా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.