Publish Date:Feb 28, 2020
టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రజలలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఈ తొమ్మిది నెలల కాలంలో.. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆయన ఏదైనా సమస్య మీద నిరసన తెలపాలి అనుకున్న ప్రతిసారి ఆయనను నిర్బంధిస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయనను నాలుగు సార్లు నిర్బంధించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రికంగా సృష్టించిందని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిరసన బాట పట్టగా.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో టీడీపీ కార్యకర్తలపై.. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని అప్పుడు టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని టీడీపీ చెప్పుకొచ్చింది. ఆ దాడులకు నిరసనగా చంద్రబాబు 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు. అయితే, చంద్రబాబును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంగా ఈ పర్యటనను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇక కొద్ది రోజులుగా రాజధాని అంశం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు తెరలేపడంతో.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం బాట పట్టారు. ఆ ఉద్యమానికి టీడీపీ అండగా నిలిచింది. చంద్రబాబు కూడా వారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే, ఒకసారి అమరావతి జేఏసీ బస్సు యాత్రని ప్రారభించాల్సిన సమయంలో.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు పాదయాత్రగా బస్సుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా విశాఖ పర్యటన అయితే సరే సరి. జగన్ తొమ్మిది నెలల పాలనలో చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా చంద్రబాబు 'ప్రజా చైతన్య యాత్ర'కు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గురువారం చంద్రబాబు విశాఖకు వెళ్లగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట చంద్రబాబు కాన్వాయ్ ని అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకొని.. కాన్వాయ్ పైకి చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. వారిని పోలీసులు నిరువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని వెనక్కి పంపారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతిచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళన కారుల్ని అడ్డుకోవాల్సింది పోయి, ఇలా అనుమతిచ్చి మరీ ప్రతిపక్ష నేతని అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. తమ నేతని కావాలనే ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-govt-targeting-chandrababu-25-94875.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.