వైసీపీ బరితెగించేసింది.. తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా ఉండాల్సిందే!

Publish Date:Apr 16, 2024

Advertisement

ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేసైనా గెలుపు సొంతం చేసుకోవడమే లక్ష్యం అంటూ వైసీపీ బరితెగించేసింది.   తన అస్తిత్వం, ఉనికి ప్రమాదంలో పడిందని భావించినప్పుడు సామాన్యులు కూ ఎంతో కొంత తెగిస్తాడు. అయితే  పరిమితులు, హద్దులు చెరిపేసి మరీ చేసే అరాచక విన్యాసాన్ని బరితెగింపు అంటాం. ఇప్పుడు గెలుపు తలుపులు అన్నీ మూసుకు పోయాయి అని అర్ధమైన తరువాత వైసీపీ అధినేత జగన్, ఆయన కోటరీ బరితెగించేశారు.   ఏదో సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. పది మంది మంచి కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని.. ఇప్పుడు వైసీపీ మంచి కోసం కాదు, తన ఉనికి కోసం అలాంటి బరితెగింపును ఆశ్రయించింది. దానినే ప్రదర్శిస్తున్నది.   ధర్మాధర్మాలూ నీతినియమొలూ ఉచితానుచితాలూ పెద్దాచిన్నా స్వపరభేదాలూ సమయాసమయాలూ ఏమీ లెక్కచేయడం లేదు. రాష్ట్రం, జనం ఏమైపోయినా, ఏమనుకున్న ఫరవాలేదు.. గెలస్తే చాలు అన్నట్లుగా బరితెగించి వ్యవహరిస్తున్నది.  

జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం, ఆ తరువాత సొంత పార్టీ ఏర్పాటు, అధికారపగ్గాలు అందుకోవడం ఇలా అన్ని విషయాలలోనూ బరితెగింపునే ఆశ్రయించారని చెప్పాలి.    తన తండ్రి హఠాన్మరణం తరువాత ఆయన కుమారుడిగా ముఖ్యమంత్రి పీఠం సహజంగా తనదే అవుతుందని భావించారు. దానిని అందుకోవడానికి బరితెగించి ఆయన పార్ధివదేహం  పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ ఆరంభిచారు. సానుభూతి పవనాల పల్లకీ మరొకరు ఎక్కకుండా ముందే విజ్ఞులు ఛీ అంటారని కూడా లెక్కచేయకుండా ముందుకు దూకి పార్టీ అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించారు. అయితే అధిష్ఠానం ఆ ఒత్తిడికి తలొగ్గకపోవడంతో కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి వైసీపీని ఆరంభించేశారు.   అదీ ఒక విధంగా బరితెగింపే. 

సరే  ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి   అడుగులు వేశారు.  తండ్రి కాలధర్మం చెందిన తరువాత ఓదార్పుయాత్ర పేరుతో ఆయన చేసిన విచిత్రం కూడా బరితెగింపే.   రాజశేఖర రెడ్డి గారి ళమరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వేలాదిమంది లక్షలాది మంది మరణించారు అని ప్రచారం చేసి వాళ్ళందరినీ ఓదార్చడం కోసం సుదీర్ఘయాత్ర చేసారు.  మహాత్మాగాంధీ హత్యానంతరం కూడా దేశంలో వేలాది గుండెలు ఆగిపోలేదు. కాని రాజశేఖర రెడ్డి   మరణం వలన వేలాది గుండెలు ఆగాయంటూ, సహజ మరణాలను కూడా  ఆ జాబితాలో వేసుకోవడానికి  జగన్ ఇసుమంతైనా వెనుకాడలేదు.  తండ్రి మరణం తరువాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తరువాత ఎన్నికలలో జగన్ రెడ్డికి ఓదార్పు యాత్ర ఫలం దక్కలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత నుంచే జగన్  తనదైన మార్క్  రాజకీయాలకు తెరలేపారు. ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడం, వారి సానుభూతి కోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం కనిపించింది. 

గత ఎన్నికల ముందు కోడి కత్తి దాడి, సొంత బాబాయ్ వివేకా హత్య సంఘటనలను తనకు అనుకూలంగా మలచుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అధికారపగ్గాలు అయితే అందుకున్నారు కానీ జగన్ అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో ఆయన పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది.  ఆయన సర్కార్ జారీ చేసిన దాదాపు ప్రతి జీవోనూ కోర్టులు తప్పుపట్టాయి. ప్రతి నిర్ణయాన్నీ తప్పుపట్టాయి. ఇలా న్యాయస్థానాలలో ఇన్ని మొట్టికాయలు తిన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. జగన్ పాలన అంతా   ప్రతిపక్షాలను సాధించడం, ఆ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టునూ నిర్వీర్యం చేయడంతోనే సరిపోయింది. ప్రజల ఆంకాంక్షల గురించిన పట్టింపు లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ గెలవడం తప్ప మరో లక్ష్యం లేదు జగన్ కు.  తన పాలన చూసి ఎవరూ ఓటు వేయరన్న విషయాన్ని ముందే గ్రహించిన జగన్ జనాలను బెదరించి ఓట్లు వేయించే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డేటా మొత్తం వారి గుప్పెట్లో పెట్టి బెదరించో, బెల్లించో ఓట్లు దండుకునేందుకు వ్యూహం పన్నారు. ప్రజాప్రతినిథ్య వ్యవస్థలో అసలు చోటే లేని వ్యవస్థ ను తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లని పేరుపెట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు ప్రజాధనం నుండి ఎలా చెల్లిస్తారు? వాళ్ళు ఎన్నకైన ప్రజాప్రతినిధులనూ లెక్కచేయనంత పెత్తనం ఎలా చెలాయిస్తారు. ఇదంతా బరి తెగింపే కదా? ఈవాలంటీర్లసైన్యం వెనుక ఉన్ఞ లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రతిపక్షాలనూ ఫ్రజలనూ భయోత్పాతానికీ అభద్రతకూ గురిచేయటం. తన అధికారాన్ని తిరుగులేకుండా చేసుకోవడానికే.    అయితే జగన్ బరితెగింపునకు ఎన్నికల సంఘం స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం చేసింది.

దీంతో ఇక జగన్ ఎన్నికలలో విజయం కోసం ఇంకెంత బరితెగిస్తారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  వచ్చే ఎన్నికలలో జనం స్వేచ్ఛగా, నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేకుండా చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇప్పటికే ఓట్ల జాబితాలో ప్రతిపక్షానికి చెందిన వారి ఓట్లు వేల సంఖ్యలో మాయ మయ్యాయని, అలాగే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయనీ అంటున్నారు. జగన్ తన కోసం తన చేత తానే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. సరే ఓటర్ల జాబితాల సవరణలు, అవకతవకలకు పాల్పడిన, అందుకు దోహదపడిన అధికారులపై చర్యలు అంటూ ఏదో ఓ తంతు జరిగినా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలను పూర్తిగా సరిదిద్దలేదన్నదే పరిశీలకుల విశ్లేషణ. ఇంత ఆలస్యంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం దొంగలు ఇంట్లో పడ్డాకా తలుపులు మూసిన తంతులా ఉందని అంటున్నారు.

అసలు జగన్ వై నాట్ 175 అనడంలోనే బరితెగింపు  ఉందని పరిశీలకులు అంటున్నారు. నోరెత్తే మనిషి లేకుండా చేసి, వ్యతిరేకించే వారి గొంతు నొక్కేసి , జనాల స్వేచ్ఛను హరించేసి, తన పార్టీకి ఓటు వేసే వాళ్లు మాత్రమే పోలింగ్ బూత్ వద్దకు చేరేందుకు వీలుగా శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించేందుకు కూడా జగన్ వెనుకాడరని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజుల తరువాత కూడా రాష్ట్రంలో విపక్షాలపై దాడులు యథేచ్ఛగా జరుగుతుండటం ఇందుకు ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో  సర్వేల ఫలితాలు, తమ సభలకు వస్తున్న జన స్పందన చూసి విజయంపై ధీమాతో ప్రమత్తంగా ఉండకుండా తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా వ్యవహరించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవలసిన ప్రమాదం ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.